Tuesday, April 30, 2019

ఎస్‌బీఐ అలర్ట్.. రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!

ఎస్‌బీఐ అలర్ట్.. రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!




మీరు ఎస్‌బీఐ బ్యాంక్ కస్టమరా? అయితే మీకు ఒక అలర్ట్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలను మార్చింది. ఇవి మే 1 నుంచి అమలులోకి రానున్నాయి. వీటి వల్ల బ్యాంక్ కస్టమర్లపై ప్రభావం పడనుంది. అందుకే మీరు కూడా మారిన నిబంధనలను తెలుసుకోవాలి.

ఎస్‌బీఐ మే 1 నుంచి తన రుణాలను, డిపాజిట్లను రెపో రేటుతో అనుసంధానం చేయనుంది. దీంతో ఎస్‌బీఐ నుంచి రుణాలు చౌకగా మారతాయి. రెపో రేటుతో రుణ, డిపాజిట్ రేట్లను లింక్ చేయనున్న తొలి బ్యాంక్ ఎస్‌బీఐనే.



ఎస్‌బీఐ అలర్ట్.. రేపటి నుంచి మారే రూల్స్ ఇవే!/2019/04/new-rules-in-state-bank-of-india-sbi.html


రూ.1 లక్షపైన డిపాజిట్లకు తక్కువ వడ్డీ

మే 1 తర్వాత అమలులోకి వచ్చే కొత్త నిబంధనల వల్ల ఎస్‌బీఐ సేవింగ్స్ అకౌంట్ హోల్డర్లు వారి డిపాజిట్లపై తక్కువ వడ్డీ పొందగలరు. రూ.1 లక్షకు పైన ఉన్న డిపాజిట్లపై 0.25-0.75 శాతం తక్కువ వడ్డీ ఇస్తామని బ్యాంక్ ఇప్పటికే ప్రకటించింది. రూ.లక్ష వరకు డిపాజిట్లపై వడ్డీ రేటు 3.5 శాతంగా ఉండనుంది. ఇక రూ.లక్ష పైన డిపాజిట్లకు వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంటుంది.



రెపో రేటు అనుసంధానంతో ప్రయోజనం

బ్యాంకులు వాటి రుణ రేట్లను ఎంసీఎల్ఆర్ ప్రాతిపదికన నిర్ణయిస్తాయి. అయితే బ్యాంకులు చాలా సందర్భాల్లో రెపో రేటు తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయలేదు. బ్యాంకులు రుణ రేట్లను రెపో రేటుతో అనుసంధానిస్తే.. రెపో రేటు తగ్గినప్పుడల్లా ఈఎంఐ భారం తగ్గుతుంది. రూ.లక్షకు పైన ఉన్నా రుణాలకే రేట్లను రెపోరేటుతో అనుసంధానిస్తారు.

ఎస్‌బీఐ వడ్డీ రేటు కోత

రిజర్వు బ్యాంక్ రెపో రేటు తగ్గింపు నేపథ్యంలో ఎస్‌బీఐ కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం తగ్గించింది. రూ.30 లక్షల వరకు ఇంటి రుణాలపై వడ్డీ రేటు ఇప్పుడు 8.6 శాతం నుంచి 8.9 శాతం శ్రేణిలో ఉంది.