Saturday, December 23, 2023

How to Apply for New Ration Card/Ration Card Transfer/Corrections in Ration Card

How to Apply for New Ration Card/Ration Card Transfer/Corrections in Ration Card

28 నుంచి రేషన్‌ దరఖాస్తులు

మీ-సేవ ద్వారా స్వీకరణ!గ్రామ, బస్తీ సభల ద్వారా కార్డుదారుల ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 89.98 లక్షల రేషన్‌ కార్డులున్నాయి. ఇందులో జాతీయ ఆహారభద్రత చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద జారీ చేసిన కార్డులు 54.39 లక్షలు

రాష్ట్ర ఆహారభద్రత కార్డులు 35.59 లక్షలు

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. మీ-సేవ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలిసింది. అర్హుల ఎంపిక ప్రక్రియను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవసరమైన పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలవుతుంది. అర్హుల ఎంపిక ప్రక్రియ గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా జరుగుతుందని పౌర సరఫరాల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారులను నియమించనున్నట్లు సమాచారం

How to Apply for New Ration Card/Ration Card Transfer/Corrections in Ration Card
*ఫ్లాష్.... ఫ్లాష్....*

*హైదరాబాద్ :*

*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులు అన్ని రద్దు...!*

*ఈనెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం*

*గ్రామ సభలు,  డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డుదారుల లబ్ధిదారుల ఎంపిక*


*రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం*


*తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 2 కోట్ల 80 లక్షల రేషన్ కార్డులు*


*100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాటు, సొంత కారు కలిగి ఉంటే రేషన్ కార్డుకు అనర్హులు*

*గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డు అనర్హులు*


*ప్రభుత్వ, ఉద్యోగం, డాక్టర్, లాయర్ తోపాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ ఉండదు*

*టాక్స్ లు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులు*


*వీటితోపాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం*


*రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నూతన నిబంధనలతో నకిలీ మరియు ఫేక్ రేషన్ కార్డులకు చెక్*

*ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంపుతో పాటు రేషన్ లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచన లో రాష్ట్ర ప్రభుత్వం*

లక్షల కుటుంబాల ఎదురుచూపులు..

రాష్ట్రంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షల కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. బియ్యం వంటి సరకుల కోసమే కాకుండా ఆరోగ్యశ్రీ వంటి పలు పథకాలకూ రేషన్‌ (ఆహార భద్రత) కార్డు ఉండాలన్న నిబంధన ఉంది. ఆరోగ్యశ్రీ పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. అర్హత కలిగినప్పటికీ అనేక కుటుంబాలు రేషన్‌ కార్డుల్లేక ప్రభుత్వ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేకపోతున్నాయి. రేషన్‌ కార్డులో పేరున్న ప్రతి వ్యక్తికీ 6 కిలోల చొప్పున బియ్యం అందుతున్నాయి. హైదరాబాద్‌లో గోధుమలు కూడా ఇస్తున్నారు. గతంలో కిలో బియ్యం రూపాయికే ఇవ్వగా.. కొవిడ్‌ ప్రభావం నేపథ్యంలో మూడేళ్లుగా ఉచితంగానే బియ్యం ఇస్తున్నారు. అన్నపూర్ణ అంత్యోదయ యోజన కార్డులు ఉన్నవారికి నెలకు కిలో చక్కెర ఇస్తున్నారు. కాగా రేషన్‌ కార్డుల జారీకి అర్హుల ఎంపికకు మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. గతంలో ఉన్న మార్గదర్శకాలే కొనసాగే అవకాశాలు లేకపోలేదని పౌరసరఫరాలశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయని, కొత్త రేషన్‌ కార్డులకు అర్హుల ఎంపిక గ్రామ, బస్తీ సభల్లోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు

మార్పులు చేర్పులు సైతం..

రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు.. తప్పులను సరిచేయడానికి సైతం ఈనెల 28వ తేదీ నుంచి అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. శాసనసభ ఎన్నికల ముందు నాటికే ఈ జాబితాలో 11.02 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలు, కుటుంబసభ్యుల పేర్లు చేర్చాలని దరఖాస్తుదారులు కోరారు. ఎడిట్‌ ఆప్షన్‌ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆ ప్రక్రియ ఇన్నాళ్లూ ముందుకు సాగలేదు. రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చింది. కొత్త కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానంతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల్ని చేర్చేందుకు అనుమతివ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. 11.02 లక్షల దరఖాస్తులకు సంబంధించి 15.87 లక్షల మంది పేర్లను ఆహారభద్రత కార్డుల్లో చేరాలని ఇప్పటికే దరఖాస్తులు వచ్చాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది

తెలంగాణ ఆవిర్భవించాక 6,47,297 రేషన్‌కార్డులు జారీచేసినట్లు పౌరసరఫరాలశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వీటికింద 20,69,033మంది లబ్ధిదారులున్నారు

రాష్ట్రంలో ఇంతవరకు మొత్తం 2.82 కోట్ల మందికి పైగా రేషన్‌ లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కింద 1,91,69,000 (68%), రాష్ట్ర కార్డులకు సంబంధించి 91,30,000 (32%) మంది ఉన్నారు.

How to Check Telangana Ration Card Status Online

HOW TO APPLY FOR RATION CARD

Ration card is an essential document through which a person’s nation is to be identified. Through ration card you can get food at low cost. If any person wants to apply for ration card, then he/she have go to nearby Meeseva office to apply. Ration card is issued by the Food, Civil Supplies and Consumer Department. If any citizen wants to apply for ration card than he has to fill the application form first.

PROCEDURE FOR APPLYING RATION CARD

First Step: The applicant first has to take an application form. Application form is available on your nearest center of MeeSeva center or from official website of MeeSeva. The official website of Telangana MeeSeva is given below:

CLICK HERE for Telangana Meeseva Portal

Second Step: Click on Download-> Aoolications --> Civil Supplies , there you get different types of forms of different departments or you can directly go to this page through the given link:

CLICK HERE for  Applications

Third Step: On given page, for downloading application form, click on Civil Supplies Department option, there you get different types of application. Click on Application for New Food Security Card

Fourth Step: After downloading the application form, take a print out of application form.

Fifth Step: Fill all the following necessary information in the application form such as applicant name, age, gender, father name, address details mobile no. qualification details, district , region , no of family members , total income of family etc.

Sixth Step: Attach all documents, and submit the application form with prescribed fee. And do not forget to take an acknowledge slip from MeeSeva center.

NECESSARY DOCUMENTS

 A copy of original resident proof.

 A copy of identity proof of Aadhaar card.

 Passport size photograph of the applicant.

Click Here to Download

New Ration Card Application

Ration Card Transfer

Corrections in Ration Card