Friday, August 25, 2023

TS DSC 2024 Notification : Recruitment Notification, Apply Online @ schooledu.telangana.gov.in

TS DSC 2024 Recruitment Notification. Apply Online @ schooledu.telangana.gov.in

04-03-2024 నుండి TRT/DSC అప్లికేషన్స్ స్వీకరణ..విద్యాశాఖ కమిషనర్ దేవసేన వెల్లడి...

రేపటి నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం.. సబ్జెక్టుల వారీగా పోస్టుల వివరాలు

 ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) ఈ నెల 04 నుంచి ప్రారంభంకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్సిపల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 11062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు (SA), (SGT), భాషా పండితులు (Pandit), వ్యాయామ ఉపాధ్యాయ (PET) ఉద్యోగాలు ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ monday షురు అవుతుంది. 02-04-2024 ముగియనుంది. పరీక్షను----------------- నుంచి----------- తేదీ వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహిస్తారు. జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను పాఠశాల విద్యాశాఖ తాజాగా విడుదల చేసింది.

మొత్తం పోస్టులు: 11062

స్కూల్‌ అసిస్టెంట్‌ 2629

లాంగ్వేజ్ పండిట్‌ 727

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ 182

సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ 6,508

అప్లికేషన్‌ ఫీజు: రూ.1000

TS DSC 2024 Notification : Recruitment Notification, Apply Online  @ schooledu.telangana.gov.in

11,062 టీచర్ పోస్టులతో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎస్జీటీలు 6,508, స్కూల్ అసిస్టెంట్లు 2,629, ఎల్పీ 727, పీఈటీ 182 . దీంతోపాటు స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220లు, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి. మార్చి 4 నుంచి ఏప్రిల్ 3 వరకూ డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.*


దరఖాస్తులు ప్రారంభం: 04 March 2024

దరఖాస్తులకు చివరితేదీ: 02 April 2024

ఆన్‌లైన్‌ రాత పరీక్ష:  will be intimated later


DSC 2023 Direct Recruitment Vacancies (District Wise)

DISTRICT WISE BREAKUP OF DIRECT RECRUITMENT VACANCY POSITION FOR DSC-2024 Click Here

TS TRT/DSC Study Material Click Here

DSC-2024 Notification: Important Dates:

  1. Notification available in website from 01-03-2024
  2. Fee payments from 04-03-2024 to 02-04-2024
  3. Online application from 04-03-2024 to 02-04-2024
  4. Exams ( CBT) From ; will be intimated soon

 Click Here To Read Full Notification

Click Here

 Click Here for DSC 2023 Information Bulletin

 Click Here

 SGT Syllabus

 Click Here

 SA Syllabus

 Click Here

 Language Syllabus

 Click Here

 PET Syllabus

 Click Here

 Apply Online

 Click Here

 DSC Material

 Click Here

TS DSC 2024 Notification : Recruitment Notification to fill 11062 Teacher Posts

Telangana's government has authorized the filling of 11062 teaching positions, according to TS DSC 2024. Through DSC, these positions will be filled. Orders have been issued by the Telangana Government to fill these positions. The following roles have been authorized:

 6508 SGT, 

2629 School Assistant, 

727 Language Pandits, and 

182 PET. On 01-03-2024, the finance department issued an order to that effect.


On 01st March 2024, the Directorate of School Education, Government of Telangana, officially announced the TS DSC Notification 2024. Between 04-03-2024 and 02-04-2024, qualified applicants may submit an online application by going to the organization's website, which is available at https://schooledu.telangana.gov.in/


డీఎడ్‌ అర్హులకే ఎస్‌జీటీ పోస్టులు...


రిజర్వేషన్‌ కేటగిరీలకు ఇంటర్‌ మార్కుల్లో సడలింపు...

పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌ విధానంలోనే...

గరిష్ట వయోపరిమితి 46 ఏళ్లు...

సమాచార బులెటిన్‌ విడుదల చేసిన విద్యాశాఖ...

మొదలైన దరఖాస్తుల ప్రక్రియ...

 డీఎస్సీలో ఎస్‌జీటీ పోస్టులకు డీఎడ్‌ అర్హులే దరఖాస్తు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించేందుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) పేపర్‌-2 ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించడం లేదని వెల్లడించింది. బీఈడీ నేపథ్యంతో ఉన్న వాళ్లంతా స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ విధి విధానాలను రూపొందించింది...

ఇందుకు సంబంధించిన సమాచార బులెటిన్‌ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఇప్పటికే డీఎస్సీకి దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఏప్రిల్‌ 2వ తేదీ వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ పోస్టులకు దరఖాస్తు చేసే వారికి, ఈసారి రిజర్వేషన్‌ అభ్యర్థులకు కొత్తగా ఇంటర్‌ మార్కుల అర్హతలో 5 మార్కులు సడలింపు ఇచ్చారు. టెట్‌ ఉత్తీర్ణులై, బీఈడీ, డీఎడ్‌ ఆఖరి సంవత్సరంలో ఉన్న వారు కూడా డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది...

11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

మొత్తం 11,062 పోస్టుల భర్తీకి ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష మొత్తం ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుందని, 11 పట్టణాల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. కొత్తగా దరఖాస్తు చేసే వాళ్లు రూ.వెయ్యి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి దరఖాస్తు చేయాల్సినవసరం లేదు..

పరీక్షాకేంద్రాలు ఇవీ...

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ, సంగారెడ్డి. అయితే ఈ పట్టణాల్లో ఎన్ని పరీక్షాకేంద్రాలు ఉండాలనేది వచ్చే దర ఖాస్తుల ఆధారంగా నిర్ణయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తారు. మహిళలకు మూడోవంతు పోస్టులు ఉంటాయి...

వయో పరిమితి...

మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసేవారు 18-46 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. 2005 జూలై 7కు ముందు పుట్టి ఉండాలి. 1977 జూలై 2 నుంచి పుట్టిన వారిని గరిష్ట వయో పరిమితిగా పరిగణిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. హాల్‌ టికెట్లు, పరీక్ష కేంద్రాలు, రోస్టర్‌ విధానాన్ని తర్వాత వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు..

నియామక విధానం...

రాత పరీక్షకు 80 మార్కులుంటాయి. టెట్‌ వెయిటేజ్‌ 20 శాతం ఉంటుంది. టీఎస్, ఏపీ టెట్, కేంద్ర టెట్‌లను పరిగణనలోనికి తీసు కుంటారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుకు దర ఖాస్తు చేసే వారు యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50% మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45%) డిగ్రీ ఉండాలి. బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆఖరి సంవత్సరం బీఈడీ అభ్యర్థులు నియామకం జరిగే నాటికి సర్టిఫికెట్‌ పొంది ఉండాలి...

టెట్‌ పేపర్‌ 2 ఉత్తీర్ణులై ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు, సబ్జెక్టు టీచర్లు ఆయా సబ్జెక్టులతో బీఈడీ చేసి ఉండాలి. ఎస్‌జీటీ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 50% మార్కులతో ఇంటర్మిడియెట్‌ (రిజర్వేషన్‌ అభ్యర్థులకు 40%) పూర్తి చేసి ఉండాలి. రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్, నాలుగేళ్ల స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ చేసి ఉండాలి. పేపర్‌-1 టెట్‌ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. భాషా పండితులు, పీఈటీలు సంబంధిత సబ్జెక్టుల్లో డీఎడ్‌ చేయాలి...
04-03-2024 నుంచి డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ

 డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈసారి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచడంతో చాలా మంది దరాఖాస్తు చేసుకునే వీలుంది. గతంలో పాత డీఎస్సీకి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. వీటికి అదనంగా మరో రెండు.. మూడు లక్షల మంది దరఖాస్తు చేసుకోనున్నారు. మొత్తం 11,062 పోస్టుల్లో 2629 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 6,508 ఎస్జీటీలు, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరిలో స్కూల్ అసిస్టెంట్ 220, స్పెషల్ ఎస్జీటీలు 796 ఉద్యోగాలున్నాయి.దరఖాస్తులను ఏప్రిల్ 2 వరకు స్వీకరిస్తారు. అప్లికేషన్ ప్రాసెసింగ్ మరియు రాత పరీక్ష కోసం చెల్లించాల్సిన రుసుము ఒక్కో పోస్ట్ కు రూ.1,000 చెల్లించాలి. దరఖాస్తు చేసే ప్రతి పోస్టు వేర్వేరు దరఖాస్తులను

NOTE:Technical Support Number: +91-9154114982/+91-6309998812 & Mail ID: helpdesktsdsc2023@gmail.com